ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు

Spread the love

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం బేస్‌ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్‌పుర్‌ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. యువన్‌ ట్రెక్కింగ్‌ కోసం 6 నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాడు. ‘‘గైడ్‌ సహాయంతో ఏప్రిల్‌ 8న ట్రెక్కింగ్‌ ప్రారంభించాం. 11 రోజుల్లో బేస్‌ క్యాంప్‌నకు చేరుకున్నాం’’ అని యువన్‌ తండ్రి తెలిపారు.

Print Friendly, PDF & Email